Friday, March 29, 2024

Muttukuru : మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికని ఆవిష్క‌రించిన‌.. మంత్రి కాకాణి

ముత్తుకూరు (ప్రభ న్యూస్) కృష్ణపట్నం గ్రామంలోని దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో పునర్నిర్మాణం చేయబడిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మహా కుంభాభిషేక మహోత్సవాల ఆహ్వాన పత్రికను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె జనార్దన్ రెడ్డి మంత్రిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక ఇవ్వగా ఆవిష్కరణ చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు కుంభాభిషేకం మహోత్సవాలు జరగనున్నాయి. సుమారు 13.5 కోట్ల రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణం నూతనంగా జరిగింది. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో పాటు పంచాయతీ ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు ఆలయ పాలకమండలి సభ్యులు , తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement