Thursday, April 25, 2024

మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ @లూసిఫర్ రీమేక్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్ లలో చిరంజీవి నటించబోతున్నారు. అయితే ఇందులో లూసిఫర్ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మోహన్ రాజా సినిమా కథ ని సిద్ధం చేశారు.

అయితే ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నార. ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇదే విషయాన్ని చెబుతూ దర్శకుడు మోహన్ రాజస్థాన్ తో కలిసి ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement