Thursday, March 28, 2024

ఆ జిల్లాలో సెల్ఫీలు నిషేధం.. ఉల్లంఘించారో జైలు శిక్ష..!

కొత్త మంది ఎక్కిడికెళ్లిన ఓ సెల్ఫీ దిగి ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఓ అలవాటుగా పెట్టుకుంటారు. అయితే సెల్ఫీ హడావుడిలో పడి ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అన్న సంగతి మరచి..సెల్ఫీల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం అలాగే గుజరాత్ లోని సాత్పుర టూరిస్ట్ స్టాట్ కూడా అదే కోవాకు చెందినది. దీంతో అధికారులు ఓ కొత్త రూల్ తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో సెల్ఫీలు దిగడం నేరంగా పరిగణిస్తూ ఓ కొత్త నిబంధన తీసుకువచ్చారు దంగ్‌ జిల్లా అధికారులు. సాత్పుర లాంటి టూరిస్ట్‌ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్‌లో అధికారులు హెచ్చరించారు. ఈమేరకు జూన్‌ 23నే అదనపు కలెక్టర్‌ పేరిట పబ్లిక్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్‌ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 

గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్‌ టూరిస్ట్‌ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. ఇక ఈ స్ఫూర్తితో తమ దగ్గర ఇలాంటి ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్‌ ప్రాంతాల ఊర్లు కొన్ని డిమాండ్‌ చేస్తుండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement