Friday, April 26, 2024

టీడీపీ ‘సాధన దీక్ష’.. ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు ఆందోళన!

కరోనా బాధితులను ఆదుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో ఆయనతో పాటు మరో 15 మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దీక్షలో పాల్గొంటారు. రేషన్ కార్డుదారులకు రూ. 10 వేలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌తో మొత్తం 10 డిమాండ్లతో టీడీపీ ఈ దీక్షలు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement