Tuesday, April 30, 2024

విజయ్ దేవరకొండతో మృణాల్ ఠాకూర్.. పూజాకార్య‌క్ర‌మాలు పూర్తి

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నాడు.ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు పర‌శురామ్ తెర‌కెక్కిస్తుంన్నాడు. కాగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రిగాఇయ‌. హీరో హీరోయిన్లపై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా షూటింగు మొదలైంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇది. ‘గీత గోవిందం’ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో మంచి రేటింగును నమోదు చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎప్పటి నుంచో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పటికి కుదిరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement