Thursday, May 9, 2024

మ‌ళ్ళీ పెళ్లి ట్రైల‌ర్.. రియ‌ల్ స‌న్నివేశాలు రీల్ గా చూపించారే

మ‌ళ్ళీ పెళ్లి ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.. రియ‌ల్ స‌న్నివేశాలను రీల్ గా చూపించారు ఈ ట్రైల‌ర్ లో. కాగా సీనియ‌ర్ న‌టుడు న‌రేష్.. పవిత్ర లోకేష్ జంట‌గా న‌టించిన చిత్రం మ‌ళ్ళీ పెళ్లి.. ఈ చిత్రం మే 26, 2023న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా, థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు మేక‌ర్స్. ఈ ట్రైలర్ ప్రధాన పాత్రల జీవితాల్లో మలుపులతో నిండిన ఆకర్షణీయమైన కథాంశంపై క‌ట్ చేశారు.ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, అనన్య నాగళ్ల, రోషన్, వనిత విజయ్‌కుమార్, అన్నపూర్ణ, అడ్డూరి రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నిర్మాతగా.. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు రచన, దర్శకత్వం వహించారు.మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ చూస్తే… నరేష్ జీవితంలో జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే అని అర్థం అవుతోంది.

అయితే… సినిమాలో పేర్లు మార్చారు. నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్రా లోకేష్ కనిపించారు. మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది టాపిక్ నుంచి ‘మా’ ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్ & మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్లో అన్నీ చూపించారు. మేడమ్ (విజయ నిర్మల) కొడుకు నరేంద్ర అని అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ వింటుంటే… ఎటువంటి మొహమాటాలకు పోలేదని తెలుస్తోంది. డైలాగుల్లో కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా చోటు చేసుకున్నాయి. వెయ్యి కోట్ల ఆస్తి నరేష్ వెనుక ఉందని చెప్పకనే చెప్పారు. ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే అని వనితా విజయ్ కుమార్ చేత ఓ డైలాగ్ చెప్పించారు. నరేష్ సైడ్ తీసుకున్నట్లు కాకుండా కొన్ని సన్నివేశాల్లో ఆయన్ను నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement