Monday, May 13, 2024

మహేష్ బాబు పక్కా ప్లానింగ్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో పలు సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నారు. కానీ సర్కారు వారి పాట సినిమాకు మాత్రం అనుకున్న సమయానికంటే ముందుగా రిలీజ్ కాబోతుందట. మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా మా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

కానీ అనుకున్న సమయానికి ముందే అంటే దసరా తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తుందట.ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తోసినిమాను స్టార్ట్ చేసి 2022 సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట మహేష్. ఆ తర్వాత రాజమౌళి తో సినిమా ను పట్టాలెక్కించబోతున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement