Wednesday, May 8, 2024

రామ్ కు విలన్ గా మాధవన్ ?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమా లో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు రామ్ పోతినేని. ఇక ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే వెంటనే లింగుస్వామి తో సినిమాకు ఓకే చెప్పాడు రామ్. ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఓ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మాధవన్ ను విలన్ గా తీసుకో పోతున్నారట. గతంలో సవ్యసాచి సినిమాలో విలన్ గా మాధవన్ నటించారు. ఆ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే నిశ్శబ్దంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేశాడు. ఇక ఈ సినిమాలో మరి ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement