Monday, May 6, 2024

‘మా’ ఎన్నికలు రాజేంద్రప్రసాద్ కు ముందు రాజేంద్ర ప్రసాద్ తరువాత

టాలీవుడ్ లో మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో సినీస్టార్స్ ఒక్కొక్కరుగా వారి అభిప్రాయాన్ని బయట పెడుతూ బయటకు వస్తున్నారు. ఇక ఈ సారి ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ బరిలో నిలబడుతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను కూడా ప్రకటించారు. అంతే కాకుండా మీడియా ముందుకు వచ్చి తన ఆలోచన కూడా చెప్పారు.

అంతేకాకుండా ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నాగబాబు, హీరో శ్రీకాంత్, బండ్ల గణేష్ ,అజయ్, తనీష్, అనసూయ, ప్రగతి, బెనర్జీ అందరూ కూడా మీడియా ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీవారి దర్శనం నిమిత్తం వెళ్ళిన రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష ఎన్నికలపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఎన్నికలు అన్నాక ఎవరికి వారు పోటీ చేయడం సహజం. మా అసోసియేషన్ అంటే రాజేంద్రప్రసాద్ కు ముందు రాజేంద్రప్రసాద్ తర్వాతే అంటూ పేర్కొన్నారు. అయితే ఈ సారి తన మద్దతు ఎవరికీ అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఆవేదన తో వచ్చా…ప్రశ్నిస్తాం !! ప్రకాష్ రాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement