Thursday, April 25, 2024

ఆవేదన తో వచ్చా…ప్రశ్నిస్తాం !! ప్రకాష్ రాజ్

మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇండస్ట్రీలో ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారింది. ఈ నేపథ్యంలోనే మీడియా ముందుకు వచ్చారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీకి వచ్చింది పంతం తో కాదని ఆవేదనతో అని అన్నారు. అలాగే తనని నాన్ లోకల్ అని కొంతమంది అంటున్నారని గత ఎన్నికలలో కానీ, రెండు గ్రామాలను దత్తత తీసుకున్నపుడు గాని , తొమ్మిది నంది అవార్డులు, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనే మాట గుర్తుకు రాలేదని… ఇప్పుడు నాన్ లోకల్ అని ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించారు.

అలాగే కొన్ని మీడియా సంస్థలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి అంటూ చెబుతూ ప్రచారం చేస్తున్నారని… దయచేసి అలాంటి ప్రచారం చేయకండని అన్నారు. ఈ పరిస్థితి లో సామాన్య ఆర్టిస్ట్ ల పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసని అన్నారు. తన ప్యానల్ లో నుంచి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించే వారే అని ఆఖరికి నేను తప్పు చేసినా ఖచ్చితంగా ప్రశ్నిస్తారని అన్నారు.

ఇక్కడ ఎవరూ పదవులకోసం రాలేదని అందరూ పని చేయడానికి వచ్చారని పేర్కొన్నారు. అలాగే పెద్దవారు తమ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నారని అలాంటి వారిని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదని… వారిని కష్టపెట్టే ఉద్దేశం కూడా తనకు లేదని అన్నారు ప్రకాష్ రాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement