Tuesday, April 30, 2024

త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ కానున్న‌ ఎల్ జీఎం.. ధోనీ

ఎల్ జీఎం చిత్రం త‌మిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుందని క్రికెట‌ర్..నిర్మాత ధోనీ వెల్ల‌డించాడు. నిర్మాణ రంగంలోకి దిగిన ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్‌ని స్థాపించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌జీఎం పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. దీనికి తన భార్య సాక్షి ధోని నిర్మాతగా ఉన్నారు. రమేష్‌ తమిళ్‌ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యోగిబాబు, మిర్చి విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్లు ఇచ్చారు ధోని. తన భార్య సాక్షితో కలిసి ఆయన ఈ సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చేందుకు ధోని, సాక్షి మీడియా ముందుకు వచ్చారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ట్రైలర్‌ని, ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. చిత్ర దర్శకుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ, కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement