Sunday, April 28, 2024

Trinatha Rao : కొత్త చిత్రానికి శ్రీకారం….

త్రినాథరావు నక్కినకు వినోదాత్మక చిత్రాల దర్శకునిగా పేరుంది. ఆయన తన నక్కిన నేరేటివ్స్‌ తరుపున కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి హీరోగా నటిస్తున్నారు. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సందీప్‌ కిషన్‌ క్లాప్‌ కొట్టగా, శరత్‌ మరార్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. సుమంత్‌ గౌరవ దర్శకత్వం వహించారు.దృశ్యం సినిమాలో వెంకటేష్‌ కుమార్తెగా నటించిన ఎస్తేర్‌ అనిల్‌ నాయికగా నటిస్తోంది. తారక్‌ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఈగల్‌ ఫేమ్‌ దావ్‌జాంద్‌ సంగీతం అందిస్తున్నారు.
త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నాలాగే ఇబ్బంది పడుతున్న అనేక మంది ఉన్నారు. వారిలో కొందరికి నా శక్తికి తగిన ఫ్లాట్‌ఫామ్‌ ఏర్పాటుచేయాలని అనుకున్నాను. దీనికి మిత్రులు సహకరిస్తున్నారు. ఇది కల్ట్‌ లవ్‌స్టోరీ. ఇందులో విలన్‌ పాత్ర కీలకమైనది. దేవ్‌ జాంద్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు వంశీ కృష్ణ మల్ల మాట్లాడుతూ నక్కిన గారు ప్రేమించి రాసుకున్న కథని నా చేతిలో పెట్టారు. వందశాతం న్యాయం చేస్తా. అనకాపల్లి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది. అన్నారు. హీరో విక్రమ్‌, హీరోయిన్‌ ఎస్తేర్‌ తమకు లభించిన అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement