Monday, April 29, 2024

శ్రీవారిని ద‌ర్శించుకున్న కృతిస‌న‌న్.. వివాదంలో ద‌ర్శ‌కుడు

హీరోయిన్ కృతిస‌న‌న్ నేడు తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకుంది. దర్శకుడు ఓం రౌత్ తో పాటు ఆమె శ్రీవారి సేవలో తరించారు. ఓం రౌత్, కృతి సనన్ తిరుమల సందర్శన వీడియో వైరల్ అవుతుంది.ద‌ర్శ‌నం అనంతరం గుడి వెలుపల కృతి సనన్ ను ముద్దుపెట్టుకుని, హత్తుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన స్థలంలో ఈ పనేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ… తిరుమల ఒక ఆధ్యాత్మక పుణ్యక్షేత్రమని, ఇది పిక్నిక్ స్పాట్, షూటింగ్ స్పాట్ కాదని అన్నారు. స్వామివారి అర్చన సేవలో పాల్గొని ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయ మహాద్వారం ముందు ఇలాంటి పని చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నార్త్ కల్చర్, సినిమా కల్చర్ ఏదైనా కావొచ్చు, ఇలాంటివి ఇంట్లోనో లేదా మారిషస్ లోనే చేసుకోవాలని… దేవుడి సన్నిధిలో ఇది సరికాదని అన్నారు. మరోవైపు, కృతి సనన్ కు ఫ్లైట్ టైమ్ అవుతోందని, ఆమె హడావుడిగా బయల్దేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో దర్శకుడు ఆమెకు సెండాఫ్ ఇచ్చాడని చెపుతున్నారు. ఇందులో అసభ్యత లేదని అంటున్నారు.

https://twitter.com/shreyasgroup/status/1666290293573038081
Advertisement

తాజా వార్తలు

Advertisement