Sunday, April 28, 2024

Cricket : ర‌విచంద్ర‌న్ అశ్విన్.. ర‌వీంద్ర జ‌డేజా సేవ‌లు వినియోగించుకోమ‌న్న స‌చిన్

ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించ‌డానికి ఏం చేయాలో తెలిపారు క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సేవలను వినియోగించుకోవాలని సచిన్ తెలిపారు. ఓవల్ మైదానంలో ఆడుతున్నందుకు భారత్ జట్టు సంతోషంగా ఉంది. ఓవల్ మైదానం మ్యాచ్ నడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కనుక స్పిన్నర్లకు కొంత మొగ్గు ఉంటుంది అని టెండూల్కర్ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ మేటి స్పిన్నర్లు అని తెలిసిందే. దీంతో సచిన్ ఈ సూచన చేసినట్టుంది. భారత బౌలర్లకు ఓవల్ చక్కని వేదికగా సచిన్ అభిప్రాయపడ్డాడు. మరి తుది 11 మందిలో వీరిద్దరికీ టీమిండియా అవకాశం ఇస్తుందా? లేక ఒకరికి అవకాశం ఇచ్చి, సీమర్ల వైపు మొగ్గు చూపుతుందా.. అనేది చూడాలి..ఆస్ట్రేలియా, భారత్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నేటి నుంచే ఓవల్ మైదానంలో మొదలు కానుంది. ఇక్కడ సీమర్లకు పిచ్ అనుకూలిస్తుంది. ఈ మైదానంలో టెస్ట్ మ్యాచుల్లో ఫలితం తేలే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు చూస్తే మూడింట రెండొంతులు డ్రాకే అవకాశాలు ఎక్కువ.

Advertisement

తాజా వార్తలు

Advertisement