Friday, May 3, 2024

Guntur : భార్యను చంపి.. భర్త ఆత్మహత్యాయత్నం..

భార్యను గొంతు నులిమి చంపి.. ఆ తర్వాత భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి రంగా కాలనీలో చోటు చేసుకుంది. భార్య గొంతు నులిమి చంపిన భర్త.. తానూ పురుగులమందు తిని ఆత్మహత్యప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా ఏదో విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ హత్యకు అదే కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement