Friday, April 26, 2024

ఆది పురుష్ లో కిచ్చా సుదీప్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఇక సీతగా కృతిసనన్ నటిస్తోంది. ఇది ఇలా ఉండదు తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాలో రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో కిచ్చ సుదీప్ కనిపించబోతున్నాడట.

సుధీర్ గతంలో బాహుబలి లోనూ ఓ గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇక ఈ సినిమా త్రీడీలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ,హిందీ భాషల తో పాటు విదేశీ భాషల్లో కూడా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ డేట్లు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement