Tuesday, April 16, 2024

నాకు వ‌చ్చిన‌వి ప్ర‌జ‌ల ఓట్లు… వారికి ద‌క్కిన‌వి దొంగ ఓట్లు… పనబాక లక్ష్మీ

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ దే నైతిక విజయం
ప్ర‌మాణానికి నేను రెడీ, మీరు రెడీనా.. ఓటమి తర్వాత పనబాక లక్ష్మి రియాక్షన్
తనకు వచ్చిన ప్రతి ఓటును వెంకటేశ్వరస్వామి దీవెనగా భావిస్తున్న
తిరుపతికి తన సేవల్ని కొనసాగిస్తూనే ఉంటాను
టీడీపీకి వచ్చిన ఓట్లన్నీ ప్రజాస్వామ్యయుతంగానే వచ్చాయని వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తా
తిరుపతిలో ఓటమిపై పనబాక స్పందన
నైతిక విజయం టీడీపీదే అన్న లక్ష్మి
పార్టీ నేతలు, కార్యకర్తలపై ప్రశంసలు

గూడూరు :తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు వెలువడి 2 రోజులు అయ్యింది, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 2,71,592 భారీ మెజార్టీతో విజయం సాధించారు. గురుమూర్తికి 6,26,108 (56.7శాతం) ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,54,516 (32.1శాతం).. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 57,080 (5.2శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీ రెండో స్థానం దక్కగా.. బీజేపీ-జనసేన కూటమి కలిపి తక్కువ ఓట్లకే పరిమితం అయ్యింది. ఓటమి తర్వాత పనబాక లక్ష్మి ఎన్నికల ఫలితాలపై మంగళవారం హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా”ఆంధ్రప్రభ” తో మాట్లాడారు. తనకు వచ్చిన ప్రతి ఓటును వెంకటేశ్వరస్వామి దీవెనగా భావిస్తున్నాను అన్నారు. తిరుపతికి తన సేవల్ని కొనసాగిస్తూనే ఉంటానని.. తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు.. అలాగే తన కోసం కష్టపడి పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత బలాన్ని కూడగట్టుకుని తిరిగొస్తామన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని పనబాక లక్ష్మి అన్నారు. టీడీపీకి వచ్చిన ఓట్లన్నీ ప్రజాస్వామ్యయుతంగానే వచ్చాయని వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తా.. వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి ఎన్నికలు మొదటిసారి చూస్తున్నాను అన్నారు.. పోలింగ్ రోజున ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఐదు లక్షల మెజార్టీ వస్తుందన్నారు.. ఇప్పుడు ఎంత వచ్చిందో చూశారన్నారు. పక్కా ఆధారాలతో దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం, అధికారులు, పోలీసులుపట్టించుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement