టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ మరో కొత్త కథతో రాబోతున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. గత ఏడాది “బెదురులంక 2012″లో మంచి హిట్ అందుకున్న అతను ఇప్పుడు తన తదుపరి సినిమా టైటిల్ & ఫస్ట్ లుక్ను రివీల్ చేశాడు.
ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తొంది. ఈ సినిమాకి ‘భజే వాయు వేగం’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు మేకర్స్. గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.