Friday, May 3, 2024

తన ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారుతో ఫొటో దిగిన ఎన్టీఆర్..

టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఖరీదైన కార్లు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. చాలా రకాల ఖరీదైన కార్లు ఉన్నాయి కాగా లంబోర్ఘిని ఉరుస్ కారును కూడా కొన్ని సంగతి తెలిసిందే. దేశంలో లంబోర్ఘిని ఉరుస్ కారును కొన్న తొలి వ్య‌క్తిగా నిలిచాడు సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఈ కారు ధ‌ర రూ.5 కోట్ల పైనే ఉంటుంది. ఇది 3.6 సెకన్లలో గంట‌ల‌కు 100 కిలోమీట‌ర్ల వేగాన్ని, 12.8 సెకన్లలో గంటకు 200 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకోగ‌ల‌దు. మొత్తానికి ఇది గంట‌‌కు 305 కిలోమీట‌ర్ల వేగంతోనూ ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వేగంతో వెళ్ల‌గ‌లిగే కారు ఇదే.

ఎన్టీఆర్ తాను కొన్న ఈ ఖరీదైన కారుతో తీసుకున్న‌ ఫొటో వైర‌ల్ అవుతోంది. సినీన‌టుడు శ్రీ‌కాంత్, టీడీపీ నేత సునీల్ కుమార్ చ‌ల‌మ‌ల‌శెట్టి కూడా ఈ ఫొటోలో క‌న‌ప‌డుతున్నారు. వారి వెన‌కాలే కారు ఉంది.ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ ప్ర‌త్యేక పాట షూటింగ్ కోసం తార‌క్ ఉక్రెయిన్ వెళ్లివ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న ఈ కారును బుక్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇటలీకి చెందిన వోక్స్‌ వాగన్‌ కంపెనీ అనుబంధ సంస్థ లంబోర్ఘినీ త‌యారు చేసిన ఈ కారు ఇటీవ‌లే అక్క‌డి నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంటికి డెలివ‌రీ అయింది.

ఇది కూడా చదవండి: ఆ యాంటీబాడీతో అన్ని కరోనా వేరియంట్లు ఖతం..

Advertisement

తాజా వార్తలు

Advertisement