Sunday, May 5, 2024

Japan OTT Release | ఓటీటీ ఎంట్రీకి ‘జపాన్’ రెడీ.. ఎక్కడంటే !

కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘జపాన్’. నవంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా, రిలీజ్ అయిన నెలరోజుల్లో ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యింది మూవీ. కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ‘‘జపాన్’’ మూవీ డిసెంబర్ 11న స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు తాజాగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.

ఇక, ప్రస్తుతం కార్తీ.. నలన్ కుమారసామీ దర్శకత్వంలో ‘వా వాతియారే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘వా వాతియారే’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో త్వరలోనే మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట కార్తీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement