Saturday, April 27, 2024

నా సేవకే నాకు టైం లేదు..!! ప్రజలకు ఏం సేవ చేస్తా – వర్మ

రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అటు సినిమాలతోపాటు రాజకీయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వర్మ. అయితే గత కొన్ని రోజులుగా వాక్సిన్, ప్రధాని నరేంద్ర మోడీ పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నాడు వర్మ. అంతే కాకుండా ప్రజలకు మాత్రం సేవ చేసే ఉద్దేశం తనకు లేదని అందుకే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకోవడం లేదని చెబుతున్నారు వర్మ. స్పార్క్ ఓటీటీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ నాకు నేనే సేవ చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు. ఇంకా ప్రజలకు ఏం చేస్తాను అంటూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలా మంది నేతలు ఫేమ్ కోసం పవర్ కోసమే రాజకీయాల్లోకి అడుగు పెడతారు. కానీ ప్రజా సేవ పై పైపై మాటలు చెబుతారు. అలాగే ఓటీటీ గురించి చెబుతూ రానున్నరోజుల్లో ఓటీటీ అనేది ప్రేక్షకులకి బాగా చెరువులో ఉంటుంది. నాకు తెలిసిన వ్యక్తి తో కలిసి దీనిని ప్రారంభిస్తున్న. దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ కంపెనీ సినిమాని కూడా దీనిలోనే విడుదల చేయబోతున్నాం. అతని జీవితాన్ని కొన్ని గంటల్లో చెప్పలేం. అందుకే వెబ్ సిరీస్ రూపంలో తీసుకొస్తున్నాం అని క్లారిటీ ఇచ్చారు వర్మ..

Advertisement

తాజా వార్తలు

Advertisement