Sunday, May 5, 2024

ఏపీలో మరోసారి 20వేలకు పైగా కేసులు…89 మంది మృతి

ఏపీలో క‌రోనా స్పీడ్ ఏ మాత్రం తగ్గటం లేదు. గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 96, 446 మందికి కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 22, 399 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే కొత్త‌గా 89 మంది కరోనా తో చనిపోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య‌ 9, 077 కి చేరింది.

ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర‌వ్యాప్తంగా న‌మోదైన మొత్తం కేసులు సంఖ్య 13,66,785 కి చేరింది. అలాగే
కోలుకున్నవారి మొత్తం సంఖ్య‌ 11, 56, 666 కి చేరింది. ఇక
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2, 01, 042 ఉండగా
24 గంటల్లో క‌రోనా నుంచి కోలుకున్న‌రు 18,638 మంది కొలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement