Sunday, April 28, 2024

హీరోయిన్ ర‌ష్మిక‌కి మేనేజ‌ర్ టోక‌రా.. రూ.80ల‌క్ష‌లు స్వాహా

త‌న మేనేజ‌ర్ చేతిలో మోస‌పోయింద‌ట హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పుష్ప సినిమాతో పాటు వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె మేనేజరుకి కూడా మంచి ఆదాయమే ఉంది. అయితే ర‌ష్మిక ద‌గ్గ‌ర చాలా కాలంగా ప‌ని చేస్తున్న ఆ మేనేజ‌ర్.. ఆమెను దారుణంగా మోసం చేసిన‌ట్లు స‌మాచారం. దాదాపు రూ.80 ల‌క్ష‌ల మేర అత‌ను ఫ్రాడ్ చేశాడ‌ని వార్తలు వస్తున్నాయి. త‌ను త‌న‌ను మోసం చేసి, భారీగా డ‌బ్బులు తిన్న విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న ర‌ష్మిక వెంట‌నే అత‌ణ్ని తొల‌గించిన‌ట్లు తెలిసింది. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీ అనే సూప‌ర్ హిట్ మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయిన ర‌ష్మిక‌కు తెలుగులో అడుగు పెట్టాకే స్టార్ ఇమేజ్ వ‌చ్చింది. ఇక్క‌డ ఆమె ఛ‌లో, గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ‌.. ఇలా హిట్ల మీద హిట్లు కొట్టి పెద్ద హీరోయిన్ అయింది. ఈ క్రమంలో పేరున్న మేనేజ‌ర్‌కు త‌న డేట్లు, ఇత‌ర వ్య‌వ‌హారాలు చూసేందుకు నియ‌మించుకుంది. అతనే ఇలా మేసం చేస్తాడని ఊహించలేదట.దాంతో తెగ ఫీల్ అవుతోంది ర‌ష్మిక‌.అతి తక్కువ కాలంలో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మంద‌న‌. అందరు స్టార్స్ కు ఈ హీరోయిన్ ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పుష్ప సినిమాతో పాటు వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement