Wednesday, May 8, 2024

DOP గా మారిన.. హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

DOP గా మారింది హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్‌తో DOP గా మారి అందరిని ఆశ్చర్య పరిచింది అనుపమా. ఈ షార్ట్ ఫిల్మ్‌ను చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అయ్యి ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ తిరిగే కథ ఈ షార్ట్ మూవీ. వరుసగా సినిమాలు.. వరుస హిట్స్ తో బిజీగా ఉన్న హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ . ఆ రకంగా ఓ రికార్డ్ సృష్టించింది. అనుపమ పరమేశ్వరన్ చివరిగా బటర్‌ఫ్లై, క్రైమ్ థ్రిల్లర్‌లో కనిపించింది. సినిమాటోగ్రాఫర్ గా అనుపమ పనితనానికి.. విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వస్తున్నాయి.దక్షిణాది భాషలన్నింటిలో తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే నటి అనుపమ పరమేశ్వరన్. నటిగానే కాక తనలో మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement