Wednesday, May 15, 2024

ఓటీటీలో విడుదలైతే ఆ కిక్కు రాదు: హరీష్ శంకర్..

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ సినిమా ‘రిపబ్లిక్’ అక్టోబర్ 1న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ… తేజ్ కు ప్రమాదం జరిగిన సమయంలో అభిమానులు స్పందించిన తీరుతో వారంతా మళ్ళీ సినిమాకు ఏ కులం, జాతితో సంభంధం లేదని నిరూపించారని తెలిపారు. అయితే ఈ కరోనా సమయంలో సినిమాలు ఓటీటీలో విడుదల కావడం పై స్పందిస్తూ… ఓటీటీలో విడుదలైన సినిమాల పరిస్థితి.. వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలియదు. కానీ మనకు సినిమాను థియేటర్లో చూసిన అనుభూతి ఎక్కడ రాదు అని అన్నారు. ఇంట్లో దేవుని ఫోటో ఉంది కదా అని… గుడికి వెళ్లకుండా ఉందాము కదా.. అలాగే థియేటర్ కూడా అని పేర్కొన్నారు. మాకు దేవాలయం వంటి థియేటర్లు తెరుచుకోవడం సంతోషమని చెప్పిన ఆయన.. తేజ్ కోలుకొని ఆసుపత్రి నుండి వచ్చే సమయానికి సినిమాను పెద్ద సూపర్ హిట్ చేసి తనకు ఘన స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్: ప్లే ఆఫ్స్ నుంచి హైదరాబాద్ అవుట్

Advertisement

తాజా వార్తలు

Advertisement