Sunday, April 28, 2024

మెగాస్టార్ కు మహానటి గ్రీన్ సిగ్నల్!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు. అలాగే దీనితో పాటు వేదాళం రీమేక్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నాడు. ఈ రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఈ సినిమాలో చిరంజీవి సోదరి గా నటించేందుకు కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట ఆ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకున్నారు. కానీ సాయి పల్లవి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నో చెప్పిందట. దీంతో కీర్తి సురేష్ ను సంప్రదించగా… ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement