Saturday, May 4, 2024

ఏపీలో మైనార్టీలకు ర‌క్షణ ఏదీ? : లోకేష్

జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.  కర్నూల్ జిల్లా  నంద్యాల‌లో చేయ‌ని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలితీసుకున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో మైనార్టీ సోదరుడు అలీషాని అన్యాయంగా చంపేసిందని ఆరోపించారు. గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పక్కరాష్ట్రం నుంచి మ‌ద్యం త‌ర‌లిస్తున్నార‌నే నెపంతో అలీషాని కొట్టి చంపేసిన‌ పోలీసుల క‌ర్కశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అక్రమమద్యం తరలించ‌డం కొట్టి చంపేంత నేర‌మైతే, విష‌పూరిత‌మైన సొంత‌ మ‌ద్యాన్ని అత్య‌ధిక ధ‌ర‌ల‌కు అమ్ముతూ జ‌నాల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న జ‌గ‌న్‌ రెడ్డిది ఇంకెంత పెద్ద నేర‌మో ఎక్సైజ్ పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. అలీషా హంత‌కుల్ని ఉద్యోగాల నుంచి తొల‌గించాలని, అలీషా కుటుంబానికి 50 లక్షల ప‌రిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ స‌ర్కారు దాడుల్నించి మైనార్టీలకు ర‌క్షణ క‌ల్పించాలని నారా లోకేష్‌ కోరారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ అంబేద్కర్ వారసుడు: మోత్కుపల్లి

Advertisement

తాజా వార్తలు

Advertisement