Sunday, April 28, 2024

సర్కారు వారి పాట సెకండ్ హీరోయిన్ ఫిక్స్ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2022 సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హీరో సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.వకీల్ సాబ్ చిత్రంలో నటించి అందరినీ ఆకట్టుకున్న నివేద థామస్ ను ఈ సినిమాలోని సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఓకే చేశారట. అందుకు నివేద థామస్ కూడా పచ్చజెండా ఊపిందట. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో పాటు మహేష్ బాబుతో సినిమా కావడం వల్ల ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తోందట. ఇక ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement