Sunday, April 28, 2024

‘ దుమారం’ ప్రారంభం

మల్లిక్‌ బాబు, వినయ్‌, ఇషా, ప్రియాన్స్‌ హీరో హీరోయన్లుగా నటిస్తున్న సినిమా దుమారం. సుమన్‌ కీలక పాత్రధారి. ఈ చిత్రాన్ని జీఎల్బీ సినిమా బ్యానర్‌ పై జీఎల్బీ శ్రీనివాస్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత జీఎల్బీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ” నాయి బ్రహ్మణుల జీవితాల నేపథ్యంతో సాగే చిత్రమిది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో సాగుతుంది. కొమురవెళ్లిలో చిత్రీకరణ కొనసాగిస్తాం. హీరో తండ్రి పాత్రలో సుమన్‌ గారు నటిస్తున్నారు.” అన్నారు.

సుమన్‌ మాట్లాడుతూ ” నాయి బ్రాహ్మణుల జీవితాలు, ఈ వృత్తిలో వారు పడుతున్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అయితే డాక్యుమెం టరీలా కాకుండూ పూర్తి కమర్షియల్‌ గా ఉంటు-ంది.” అన్నారు. ఇంకా హీరో మల్లిక్‌ బాబు, హీరోయిన్‌ ఇషా , కో ప్రొడ్యూసర్‌ తిరుపతిరాజు, పాండు గౌడ్‌ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రంలో ఇంకా రాజు బి యాదవ్‌, లక్ష్‌ రావు హైమావతి , ఎంసుబ్బరాజు . కేఎస్‌ దేవి , నరసింహ , నవల్‌ కిషోర్‌ అగర్వాల్‌ .మహేష్‌ గూడుగుంట్ల , మల్లాది శాస్త తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి సురేందర్‌ రెడ్డి. కథ, నిర్మాత, దర్శకత్వం: జి ఎల్‌ బి శ్రీనివాస్‌, స్క్రీన్‌ప్లే, మాటలు..ఎన్‌ ఎన్‌ రాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : రాజు బి యాదవ్‌, సహనిర్మాత : కెంబా జయప్రకాష్‌ నిర్మాణ, నిర్వహణ : కొండపాక కనకయ్య. కెమెరా: టి సురేందర్‌ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement