Friday, April 26, 2024

ఈ నెల 10న ‘డీజే టిల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

సితార బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం డీజే టిల్లు. హీరోగా సిద్ధు జొన్నలగడ్డ – హీరోయిన్ గా నేహా శెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీన ఫిల్మ్ నగర్ – రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లోని రొమాంటిక్ సీన్స్ చూసి ఇది యూత్ కి మాత్రమే అనుకోవద్దనీ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాను హాయిగా చూడవచ్చని విమల్ కృష్ణ తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement