Sunday, April 28, 2024

తెలంగాణ ప్రజలను అవమానించిన మోడీ : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రధాని మోడీ దెబ్బతీయడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా తెరాస అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర విభజనపై మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… తెలంగాణ అంటే మోడీకి పడదని మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే చూస్తూ ఊరుకోరని, రాబోయే రోజుల్లో బీజేపీని తరిమి కొడతారన్నారు. మోడీ అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని, దేశ ప్రధాని అలా మాట్లాడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement