Sunday, May 5, 2024

సర్కారు వారి పాట @ డిస్నీ ప్లస్ హాట్ స్టార్

గతేడాది కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా వరకు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. సినీ అభిమానులు కూడా ఓటీటీ కే అలవాటుపడ్డారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా తెరకెక్కుతోంది.

బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement