Sunday, May 5, 2024

‘అఖిల్ కోసం’ కథలో మార్పులు ?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే అఖిల్ లోని మాస్ యాంగిల్ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ బయటకు రాలేదని కానీ… ఈ సినిమాతో కచ్చితంగా బయటకు వస్తుందని సురేందర్ రెడ్డి చెప్తూ..ఈ సినిమాపై అంచనాలను పెంచారు.

అయితే ఇప్పటికే పూర్తిగా కథ రెడీ చేసిన సురేందర్ రెడ్డి మళ్లీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడట. సురేందర్ రెడ్డి కొందరు రచయితల తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి స్టోరీ మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement