Tuesday, April 30, 2024

లూసిఫర్ పై మరోసారి దర్శకుడి ఫోకస్ ?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి దీని తరువాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో నటించబోతున్నాడు. ఇక లూసిఫర్ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. చిరంజీవి స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొని మోహన్ రాజా తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టుగా ఈ స్క్రిప్ట్ ను మార్పులు చేశారు. కాగా సెట్స్ పైకి వెల్లలనుకున్న సమయంలో ఈ సినిమాకి కరోనా మహమ్మారి బ్రేక్ వేసింది.

అయితే కరోనా కారణంగా మరి కొంత సమయం దొరకడం తో ఈ సినిమా స్క్రిప్ట్ పై మరోసారి దృష్టి పెట్టాడట మోహన్ రాజా. అంతే కాదు మలయాళ వెర్షన్ లో పాత్ర లేని హీరోయిన్ ను తెలుగులో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.అలాగే హీరోయిన్ పాత్రను సింగల్ సాంగ్ లో చూపిస్తారా… ఫుల్ లెన్త్ చూపిస్తారా అనే సందేహాలు కూడా ఫ్రాన్స్ లో ఉన్నాయి. ఇక మరోవైపు హీరో ముఖ్య అనుచరుడు పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement