Thursday, April 25, 2024

వ‌రంగ‌ల్ కు విమానాశ్ర‌యం – కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హామీ..

వరంగల్‌: వ‌రంగ‌ల్ అభివృద్ధి చెందాలంటే విమానాశ్ర‌యం ఉండాల్సిదేన‌ని, దానిని సాధించేందుకు కృషి చేస్తాన‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు… కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో భాగంగా ఆయ‌న 43,44 డివిజ‌న్ బిజెపి అభ్య‌ర్ధుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వ‌రంగ‌ల్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం అధిక నిధులిచ్చిందని గుర్తు చేశారు. వరంగల్ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే.. బీజేపీ మేయర్ గెలవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేతకానితనం వల్లే వరంగల్‌కు వచ్చిన పీవోహెచ్‌ పరిశ్రమ నిర్మాణం జరగలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌కు కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాగా,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు 10,11 డివిజ‌న్ ల‌లో బిజెపి అభ్య‌ర్ధుల త‌రుపున నేడు ప్ర‌చారం నిర్వ‌హించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement