Monday, May 6, 2024

కరోనాతో ఆస్పత్రిలో చేరిన టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు

టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రాథమిక పరీక్షలో కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలిందని, ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారిలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాగా కాల్వ శ్రీనివాసులుకు కరోనా సోకిందన్న విషయం తెలియడంతో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement