Saturday, April 27, 2024

మెగాస్టార్ లూసిఫర్ కథ మొదటికే ?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ… లూసిఫర్, వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. అయితే లూసిఫర్ విషయానికి వస్తే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఏదో ఒక చిక్కు వచ్చి పడుతూనే ఉంది. మొదట ఈ సినిమాకు సంబంధించి దర్శకుని విషయంలో గందరగోళం ఏర్పడగా సుజిత్, వివి వినాయక్ వంటి దర్శకులు లైన్ లోకి వచ్చారు.

ఫైనల్ గా మోహన్ రాజాకు ఆ బాధ్యతను మెగాస్టార్ అప్పగించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు సంబంధించి పరిస్థితులు మొదటికి వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల మోహన్ రాజా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు. ఇప్పుడు దర్శకుడిని వెతికే పనిలో యూనిట్ సభ్యులు ఉన్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement