Friday, April 26, 2024

కథారచయిత కారా ఎంతోమందికి మార్గదర్శి

ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపధ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా సంతాపం తెలిపారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ‘ కారా ‘ చిరస్మరణీయులన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాస్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబసభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని కృష్ణదాస్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement