Saturday, May 25, 2024

ధనుష్ జగమే తంత్రం…ట్రైలర్ చూశారా ?

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జగమే తంత్రం. ఈ సినిమాలో ధనుష్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చక్రవర్తి, రామచంద్ర శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించారు. అలాగే పక్కా మాస్ లుక్ లో ధనుష్ ఉన్నాడు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ లలో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. నిజానికి గత ఏడాది థియేటర్లలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement