Wednesday, May 15, 2024

Nagarjuna నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై క్రేజీ బజ్.. త్వరలోనే అనౌన్స్‌మెంట్ !

ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా ఆరెంగేట్రం చేశాడు. కాగా, ఈ సినిమా తర్వాత మరో కొత్త దర్శకుడుతో సరికొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నారు నాగార్జున.

సుబ్బు అనే కొత్త దర్శకుడు నాగార్జునకు ఓ క‌థ వినిపించాడ‌ట‌. నాగార్జునకు కథ న‌చ్చిడంతో పైన‌ల్ స్క్రిప్ట్ ని రెడీ చేసే ప‌నిలో స‌బ్బు ఉన్నట్టు తెలుస్తొంది. ఇక‌, ఫైనల్ నెరేషన్ పూర్తయ్యాకే సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ప్ర‌స్తుతం సంక్రాంతి బ‌రిలో ఉన్న నా సామిరంగ జనవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మించారు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, మిర్నా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement