Monday, April 29, 2024

Maldives | మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల మంత్రుల సస్పెన్షన్

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం తొలగించింది. మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్‌లను సస్పెండ్ చేసినట్లు మాల్దీవ్ స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటికి మాల్దీవుల ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి మరియం షియునా ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్దీవుల ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement