Friday, April 26, 2024

గుడ్ లక్ సఖి…రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది !!

మహానటి చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. అలాగే రజనీకాంత్ సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా కీర్తిసురేష్ నటిస్తోంది. అయితే కరోనా సమయం లో ఓటీటీ లో రిలీజ్ అయిన పెంగ్విన్, మిస్ ఇండియా అనుకున్న స్థాయిలో సాధించలేకపోయాయి. కాగా ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేస్తారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా దీనిపై నిర్మాత సుధీర్ చంద్ర స్పందించారు. ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామా లేక ఓటీటీ లో రిలీజ్ చేస్తామా అని విషయంపై ఇంకా నిర్ణయం కి రాలేదని… త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెబుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement