Sunday, April 28, 2024

నో మ్యారేజ్ అంటున్న ఛార్మి….కారణం పూరీనే అంటున్న నెటిజన్స్ !!

హీరోయిన్ ఛార్మి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో కోట్లాదిమంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందింది ఛార్మి. అయితే ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న ఛార్మి నిర్మాతగా మారింది. ఇదిలా ఉండగా ఛార్మి పెళ్లి పై ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. గతంలో దేవిశ్రీప్రసాద్ ఛార్మి లవ్ లో ఉన్నారని త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఛార్మి రిలేషన్ లో ఉన్నారని కూడా టాక్ నడిచింది.

అయితే అటువంటి సమయంలో ప్రస్తుతం నేను లైఫ్ లో బెస్ట్ సమయాన్ని గడుపుతున్నాను. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. లైఫ్ లో పెళ్లి చేసుకోవడమనే తప్పు నేను చేయను అంటూ ఛార్మి చెప్పుకొచ్చింది. దీంతో ఛార్మి పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కాగా ఛార్మి ఇలా మారిపోవడానికి కారణం పూరి జగన్నాథ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకోవటం మొదలుపెట్టారు.

అందుకు కారణం కూడా లేకపోలేదు పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో కొన్ని విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందులో సింగిల్ బై ఛాయిస్ పేరుతో ఆడియో ని పోస్ట్ చేశాడు. అందులో పూరి మాట్లాడుతూ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటే తనకు నచ్చదని హీరోయిన్స్ దేవతలతో సమానం అని కాబట్టి వాళ్లు కూడా దేవతల్లా ఆలోచించి తమ శక్తిని ఈ దేశాన్ని మార్చడానికి ఉపయోగించాలని అన్నారు. జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ ఇలా ఎంతో మంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారు. వాళ్ళకు మగవాళ్లతో పనిలేదు. హాలీవుడ్ లో అయితే పెళ్లి ని పక్కన పెట్టిన లేడీ సూపర్ స్టార్ కి కొదవే లేదు. ఇంకా రంభ ,ఊర్వశి, మేనక పెళ్లి చేసుకోలేదు. కాబట్టి స్వర్గం పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అందరూ నా మాట విని దేవతల ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు పూరీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement