Sunday, April 28, 2024

బాలయ్య టు మాస్ మహారాజా వయా బోయపాటి!!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే రవి తేజ హీరోగా క్రాక్ సినిమాతో ఇటీవల మంచి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు గోపిచంద్. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులు అటు ఇటు మారబోతున్నారట.

బాలయ్య సినిమా తర్వాత బోయపాటి రవితేజ తో సినిమా చేయబోతున్నాడట. గతంలో బాలయ్య గోపీచంద్ మలినేని ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ బోయపాటి రవితేజ మాత్రం భద్ర సినిమా చేశారు. ఆ రోజుల్లో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. మరి ఈ సారి బాలయ్య బోయపాటి ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement