Saturday, May 4, 2024

బాలీవుడ్ టాప్ బ్యూటీస్ తో ఫర్హాన్ అఖ్తర్ మూవీ..

బాలీవుడ్ లో ప్రస్తుతం ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. వీళ్లు ఏ సినిమాలో ఉంటే ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. నటన, డ్యాన్స్, ఫైటింగ్ అనే తేడా లేకుండా అన్నింట్లో వీరు ఇరగదీస్తారు… అయితే ఈ ముగ్గురు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. వీరిని డైరెక్ట్ చేయడం కోసం ఫర్హాన్ అఖ్తర్ చాలా ఏళ్ల తరువాత మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు.‘జీ లే జరా’ సినిమాని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ తో టైగర్ బేబీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనుంది. ముగ్గురు టాప్ బ్యూటీ అఖ్తర్ రోడ్ ట్రిప్ మూవీ ‘జీ లే జరా’లో హల్ చల్ చేయనున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ మూవీస్ కు దూరంగా ఉంటోన్న మిసెస్ జోనాస్ కూడా ఈసారి హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్స్ కొనసాగుతోన్న ఆలియా, కత్రీనా కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఒక్క చోట చేరటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. చూడాలి మరి, ‘జీ లే జరా’ బాక్సాపీస్ వద్దకి ఎప్పటికి చేరుకుంటుందో!

ఇది కూడా చదవండి: కాణిపాకంలో ప్రమాణం చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement