Saturday, April 20, 2024

కాణిపాకంలో ప్రమాణం చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై వైసీపీ, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ అంశం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మధ్య వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది. విష్ణు పెద్ద దొంగ అని, పుట్టపర్తి ఆశ్రమంలో డబ్బు, బంగారం దోచేశారని రాచమల్లు ఆరోపించారు. దాంతో తాను కాణిపాకంలో సత్యప్రమాణం చేస్తానని, ఎమ్మెల్యే రాచమల్లు కూడా రావాలని విష్ణు సవాల్ చేశారు.

అయితే ముందే చెప్పిన విధంగా బీజేపీ నేత విష్ణు మంగళవారం చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయానికి విచ్చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాణిపాకం వచ్చి దేవుని సన్నిధిలో సత్యప్రమాణం చేశానని విష్ణు తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సత్య ప్రమాణం చేసేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అంటే ఆయన అవినీతి, హత్యా రాజకీయాలు చేస్తున్నట్టు అంగీకరించినట్టే కదా? అని విష్ణు వ్యాఖ్యానించారు.

ఈ వార్త కూడా చదవండి: నేతన్నలకు పంచెలు ఊడదీసి గోచీలు ఇస్తారా?: ఎమ్మెల్యే నిమ్మల

Advertisement

తాజా వార్తలు

Advertisement