Monday, April 29, 2024

సరికొత్త స్టోరీకి ఓకే చెప్పిన దేవరకొండ

ఆనంద్ దేవరకొండ… దొరసాని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఇటీవల మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆనంద దేవరకొండకు పేరు ను తీసుకురాలేకపోయాయి. అయితే ఆనంద్ దేవరకొండ మాత్రం వరుస సినిమాలను ఓకే చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

ప్రస్తుతానికి మాత్రం పుష్పకవిమానం సినిమాతో ఈ యంగ్ బిజీగా ఉన్నాడు. అయితే తాజా సమాచారంరఘు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పాడట ఆనంద్. కాన్సెప్ట్ బేస్డ్ కావడంతో ఈ సినిమా కోసం ఆనంద్ దేవరకొండ చాలా ఆసక్తిగా ఉన్నాడట. తన పాత్ర బాగా నచ్చిందని ఇప్పటికే చాలామంది సన్నిహితుల దగ్గర కూడా చెప్పాడట. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా ఆనంద్ దేవరకొండ సరైన హిట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement