Thursday, May 2, 2024

వైద్య పరికరాలు అందజేసిన అమితాబ్..

క‌రోనాపై పోరులో తన వంతు సాయం చేసిన అమితాబ్ బచ్చన్ మరోసారి తన మనసు చాటుకున్నారు. సుమారు రూ.1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్‌లో గల లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రికి అందజేశారు. ఈ విష‌యాన్ని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ తెలియ‌జేసింది. శ్వాస స‌మ‌స్య‌తో బాధ‌పుడుతున్న వారికి ఈ వెంటిలేట‌ర్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

కరోనా కట్టడికి అమితాబ్ సుమారు రూ.15కోట్లు వరకూ విరాళంగా ఇచ్చారు. ఇక దిల్లీలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రెండు కోట్లు సాయం చేసిన అమితాబ్ జుహూలో 25-50 బెడ్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చారు. చాలామంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందజేశారు. ముంబయిలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్‌ పరికరాలు సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement