Sunday, April 28, 2024

క్రిష్,వైష్ణవ్ తేజ్ ల సినిమాకు అమెజాన్ బంపర్ ఆఫర్!!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. విలేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందట. అయితే ఆ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిత్ర నిర్మాతలకు మాత్రం లాభదాయకంగానే ఈ ఆఫర్ ఉందట. అలాగే ఈ సినిమాను నేరుగా డిజిటల్ రిలీజ్ డేట్ చేసేందుకు కూడా దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారట. ఇక ఇదిలా ఉండగా అక్కినేని నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ మూడవ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement