Friday, March 29, 2024

Tokyo Olympics: పరుషుల హాకీ జట్టుకు నిరాశ.. సెమీస్‌లో ఓటమి

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ లో ఓటమి చెందింది. బెల్జియంతో జరిగిన మ్యాచ్ లో భారత్ 5-2 తేడాతో ఓటమి పాలైంది. దీనితో టీమిండియా కాంస్యం పొరనుంది. ఫ‌స్ట్ హాఫ్‌లో మ‌న్‌ దీప్ సింగ్‌, హ‌ర్మ‌న్‌ ప్రీత్ సింగ్‌ లు చెరో గోల్ వేశారు. అయితే బెల్జియం ఆట‌గాడు అలెగ్జాండ‌ర్ హెండ్రిక్స్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టటం తో భారత్ కు ఓటమి తప్పలేదు.

కాంస్యం కోసం ఇండియా మ‌రో మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ రోజు సాయంత్రం ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ లో ఓడిపోయిన జ‌ట్టుతో తలపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement